Monday 9 April 2012

NEW GDS UNION FORMED AS AN ASSOCIATE OF NFPE

ప్రభుత్వవిధానాల నేపథ్యములో , డిపార్టుమెంటు రూల్స్ పరిధిలో యి.డి. (ఆర్.ఎస్. .) 1995 రూల్స్ ప్రకారము అఖిల భారత తపాల యి. డి వుద్యోగుల సంఘం (..పి.యి.డి.యి.యు) యి.డి వుద్యోగుల నాయకత్వములో కా. ఆది నారాయణ గారిసమక్షములో ఏర్పాటు చేయబడినది.
నాటి
నుండి జరిగిన 5 అఖిల భారత మహా సభలలో పలు విదాల అభిప్రాయ బేధాలు, వేబెదాలు, సానుకూల, ప్రతికూలపరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్యముగా కేంద్ర సంఘ నాయకత్వాన్ని ఏర్పరచుకొని కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగినది. జి.డి.ఎస్ కేంద్ర సంఘ నాయకత్వము పలుమార్లు వేర్పాటు ధోరణి ప్రదర్శించి నప్పటికీ ఎన్.ఎఫ్.పి.యి ఆధ్వర్యములోబ్రాంచి, డివిజన్ స్థాయి నుండి ఇకమత్యముతో ఎన్నో పోరాట కార్య క్రమాలు నిర్వహించాము.
గత
3-4 సం. లుగా జి.డి.ఎస్ కేంద్ర సంఘ నాయకత్వము ఏకపక్ష నిర్ణయాలతో, వివాదాస్పద ధోరణిలో మన మాత్రుసంఘమైన ఎన్.ఎఫ్.పి.యి సంఘాలతో విభేదిస్తూ వస్తున్నప్పటికీ ఇక్యతా భావముతో ప్రతి సంఘము సమర్ధించడంతోసంయమనముతో నెట్టుకురావడం జరిగినది. సోదర సంఘాల ప్రధాన కార్య దర్శులతో వ్యక్తిగత విభేదాలు, ఎన్.ఎఫ్.పి.యి పట్ల వ్యతిరేక ధోరణి, ఎన్.ఎఫ్.పి.యి ని సమర్ధిస్తున్న వారిపట్ల వ్యతిరేకత మొదలగు అంశాలు తీవ్రస్థాయికి చేరుకున్నవి. కొన్ని సందర్భాలలో యి.డి డివిజనల్ యూనియన్ సంఘాల పట్ల వ్యతిరేక నిర్ణయాలు కూడాతీసుకోవడం జరిగినది.
సంఘ
నిర్మాణ పరంగా ఎన్.ఎఫ్.పి.యి సంఘాలతో కలసి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తూ , జే.సి. ద్వారానే పని చేయడంజరుగుతుందని నిర్ద్వందముగా తెలియ జేయడం, ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు తీసుకోవడం వలన పలుమార్లుఎన్.ఎఫ్.పి.యి కార్యక్రమాలు కుంటుపడే సందర్భాలు ఏర్పడినవి.
యూనియన్
కు సంబంధించిన ఆర్ధిక సంభంద అంశాలలో సరియైన పారదర్శకత లోపించి అనేక సందేహాలకు, వివాదాలకు చోటు కలిగినది.
సమగ్రత విధానము లేకపోవడం, సమస్యలపై సరియైన విశ్లేషణ, పరిష్కార మార్గములో పురోగతి లేకపోవడం తోజి.డి.ఎస్ ఉద్యోగులు వేదన భరిత వాతావరణములో జీవితం కొనసాగిస్తున్నారు.
ఐక్య పోరాటాల దిశగా సంఘాలు పురోగమిస్తున్న ప్రస్తుత దశలో జి.డి.ఎస్ కేంద్ర సంఘ నాయకత్వము తిరోగమన దిశగానిర్నయాలు తీసుకోవడం సరియగు పద్దతి కాదని పలు దఫాలుగా ప్రయత్నించి విఫలమైన పరిస్థితిలో ఎన్.ఎఫ్.పి.యిసంఘాలతో కలసివచ్చే జి.డి.ఎస్ యూనియన్ ఏర్పాటు నిర్ణయం ముందుకు వచ్చినది.
7 అఖిల భారత మహాసభ, అమరావతి (మహారాష్ట్ర సర్కిల్) లో జరుగుచున్న సందర్భముగా ఏర్పడిన పరిస్థితులు, ప్రధాన కార్యదర్శి ఏకపక్ష విధానాలు గమనించిన తరువాత, 07-04-2012 తేదిన అదే మహా సభలో నూతనయూనియన్ ఏర్పాటు చేస్తున్నట్లు గా ఎన్.ఎఫ్.పి.యి ని బలపరచే సర్కిల్ డెలిగేట్స్, కార్య దర్శులు ప్రకటించడంజరిగినది.

యూనియన్ పేరు : "అఖిల భారత తపాల వుద్యోగుల సంఘం - జి.డి.ఎస్ (ఎన్.ఎఫ్.పి.యి)"
ALL INDIA POSTAL EMPLOYEES UNION - GDS (NFPE)
అదే సందర్భంగా 12 మంది సభ్యులుగా అడ హాక్ కమిటీ ఏర్పాటు చేయబడింది.
President : Com.BIJAY GOPAL SUR (WEST BENGAL)
Working President :
1. Com.PRAMOD KUMAR SINGH (UTTAR PRADESH)
2.Com.NIRMAL CH. SINGH (ORISSA)
Vice President :
1. Com. Smt. SUPRAVA PAL (NORTH EAST)
2.Com.GANA ACHARYA (ASSOM)
General Secretary:Com. P.PANDURANGARAO (ANDHRA PRADESH)
Dy. Genl. Secretary: Com.R.DHANRAJ (TAMIL NADU)
Asst. Genl. Secretary:
1.Com.B.R.JAGADEESH (KARNATAKA)
2.Com.K.C.RAMACHANDRAN (TAMIL NADU)
3.Com.RAJENDRA V. BANSODE (MAHARASHTRA)
Finance Secretary: Com.V.MURUKAN (KERALA)
Asst. Fin. Secy: Com.BALARAM SINGH THAKUR ( MADHYA PRADESH)


నూతనముగా అఖిల భారత స్థాయిలో జి.డి.ఎస్.సంఘం ఏర్పాటు చేయుటకు అన్ని విధాలుగా సహకరించిన డెలిగేట్స్, బ్రాంచ్, డివిజన్ కార్య దర్శులు, శేయోభిలాషులు, కార్యకర్తలు, సోదర సంఘాల నాయకులకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

No comments:

Post a Comment